మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి అయింది. కాబట్టి ఈ విషయాన్ని పక్కన పెడితే చరణ్ తన తదుపరి మూవీల విషయంలో మాత్రం పక్కాగా సూపర్ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే చరణ్ బుచ్చిబాబు తో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. శివరాజ్ కుమార్మూవీ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు , సుకుమార్ లతో సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఇక గేమ్ చేంజర్ మూవీ తో పాటు బుచ్చిబాబు , సుకుమార్ లతో చేయబోయే సినిమాల రిజల్ట్ ని బట్టి ఆ తర్వాత మూవీలను చరణ్ డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్ తో చరణ్ ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: