రామ్ చరణ్ గురించి ఇపుడు ఒక్క తెలుగు వారికి మాత్రమే కాదు, యావత్ ఇండియన్స్ కి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ వారసుడిగా తెలుగులోకి అడుగిడిన రామ్ చరణ్ అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లో కూడా తన ఉనికిని చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. అవును, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈనెలలో ఈమూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతోందని మూవీ మేకర్స్ తెలియజేయడం కూడా జరిగింది.

ఈ తరుణంలోనే రామ్ చరణ్ కు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే.. రామ్ చరణ్ కెరీర్లో షూటింగ్ జరుపకుంటూ ఆగిపోయిన సినిమా సంగతి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. సినిమా స్టార్ట్ అయ్యి  షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఏకైక సినిమా పేరు మెరుపు. ఆరెంజ్ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలో స్పోర్డ్స్ బ్యాక్ డ్రాప్లో ఈసినిమాను తెరకెక్కిచాలి అనుకున్నారట. బంగారం సినిమాను డైరెక్ట్ చేసిన ధ‌ర‌ణి దర్శకత్వంలో ఈమూవీని ప్లాన్ చేయగా మధ్యలోనే ఆగిపోయింది. అంతే కాకుండా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకుని.. మగధీర మ్యాజిక్ ను మళ్లీ రిపిట్ చేయాలి అనుకున్నారట.

ఈ క్రమంలోనే కొద్ది రోజులు షూటింగ్ కూడా జ‌రిగిందట. మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై అప్పట్లో మెరుపు సినిమా గ్రాండ్ గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈమూవీ సగంలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. ఆరెంజ్ మూవీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను నిర్లక్ష్యం చేశారనే టాక్ కూడా ఉంది. కానీ ఆరెంజ్ మూవీ ఎంత షాక్ ఇచ్చిందో  అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో వైపు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీకి సిద్ధం అవుతున్నారు చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: