సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రజినీ కాంత్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో శివాజీ మూవీ ఒకటి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రేయ హీరోయిన్గా నటించగా , దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా , సుమన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. 2007 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే 2007 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాని సెప్టెంబర్ 20 వ తేదీన తెలుగు లో రీ రిలీస్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ టికెట్ ధరలకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.  అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా రీ రిలీజ్ కాబోయే కొన్ని థియేటర్లలో సెలెక్టివ్ థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధర కేవలం 99 రూపాయలుగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రీ రిలీస్ కి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం.

మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయితే ఏ థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరలు 99 రూపాయలకే ఉండనున్నాయి అనే విషయం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో రీ రిలీస్ అయిన సినిమాలకు భారీ మొత్తంలో కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. మరి శివాజీ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: