తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుజిత్ ఒకరు. ఈయన శర్వానంద్ హీరోగా రూపొందిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో మొదటి సినిమాతోనే ఈ దర్శకుడికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమాను రూపొందించే అవకాశం ఈ దర్శకుడికి వచ్చింది. దానితో ఈ యువ దర్శకుడు ప్రభాస్ హీరోగా సాహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని రూపొందించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే సాహో మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుజిత్ కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా "ఓజి" అనే మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణ కొంత భాగం పూర్తి అయింది. ఆ తర్వాత పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు సుజిత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా "ఓజి" మూవీ అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను తెలియజేశారు.

తాజాగా సుజిత్ మాట్లాడుతూ ... మొదట నాకు పవన్ కళ్యాణ్ తో ఓ రీమిక్ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ నాకు రీమిక్ సినిమా చేయడం అస్సలు ఇష్టం లేదు. ఇక అలాంటి సమయంలోనే నాకు కొత్త కథతో సినిమా చేసే అవకాశం వచ్చింది. దానితో వెంటనే నేను కొత్త కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాను. అదే "ఓజి" మూవీ అని సుజిత్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే "ఓజి" మూవీ పై ప్రస్తుతానికి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రమే కాకుండా మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: