తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా ఇప్పటికీ కూడా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున ఒక దర్శకుడిని పిలిచి మరి సినిమా చేయమన్న ఆయన చేయను అని చెప్పాడట. అసలు ఆ దర్శకుడు ఎవరు ..? ఆయన ఎందుకు చేయనన్నాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో బి గోపాల్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా బి గోపాల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా నాగార్జున గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు తాజాగా బి గోపాల్ మాట్లాడుతూ ... నాగార్జున ఒకానొక సందర్భంలో నన్ను ఓ మూవీ రీమిక్ చేయమని అడిగాడు. నాకు నాగార్జున తో సినిమా చేయడం అంటే చాలా ఇష్టం. కానీ అప్పటికే నేను రెండు సినిమాలకు కమిట్ అయి ఉన్నాను. అది రీమిక్ సినిమా.

ఒక వేళ లేట్ చేసినట్లు అయితే ఆ కథ పాతది అయ్యే అవకాశం ఉంది. దానితో నాగార్జున కు నేను చేయలేను రెండు సినిమాలకు కమిటీ అయ్యి ఉన్నాను అని చెప్పాను. ఇక ఆ తర్వాత నాగార్జునవి వి సత్యనారాయణ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఇక ఆ రీమిక్ సినిమా వారసుడు అనే టైటిల్ తో రూపొంది మంచి విజయం అందుకుంది అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: