టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఒక సినిమాలో హీరోగా నటించిన ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఈయన కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో విలన్ పాత్రలో నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా జయం , వర్షం , నిజం సినిమాలలో విలన్ పాత్రలలో నటించి గోపీచంద్ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ సినిమాలో హీరోగా నటించిన మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గోపీచంద్ సినిమాల్లో హీరో పాత్రలలో తప్ప విలన్ పాత్రలో నటించలేదు.

ఈ మధ్య కాలంలో గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు దక్కడం లేదు. ఆఖరుగా సిటీమార్ మూవీ తో మంచి విజయాన్ని ఈ నటుడు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోలేదు. గోపీచంద్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి ఫ్లాప్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. శ్రీను వైట్ల చాలా సంవత్సరాలుగా ఫ్లాప్ లలోనే ఉన్నాడు.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన ప్రస్తుతం మాత్రం వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో గోలీమార్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కి కొనసాగింపుగా వీరి కాంబోలో గోలీమార్ 2 మూవీ ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: