మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అదే సమయంలో ఒకే ఒక్క లేడీ కూడా హీరోయిన్‌గా వచ్చింది. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. మొదట్లో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. సక్సెస్ కాలేక ఇబ్బంది పడింది. ఈ పరిస్థితుల్లో నిర్మాతగానైనా సత్తా చాటాలని నిహారిక చేసిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'.పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను సినీ రంగానికి పరిచయం చేస్తూ మెగా డాటర్ నిహారిక కొణిదెల తీసిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను పెంచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌తో ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.గుండెల్ని పిండేసే కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కింది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇదిలావుండగా ఈ మూవీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు నిహారిక. ఈ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ కొడుకు అకీరా నంద‌న్ సినిమా ఎంట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. పవర్ స్టార్ తనయుడు అకీరా సినిమా ఎంట్రీ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా నిహారిక ఆస్తకికర సమాధానమిచ్చింది. "అకీరా.. చాలా చిన్నవాడు. వాడికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉండని తెలియదు. నేను వాడినిఎప్పుడూ అడగలేదు సినిమాల్లోకి వ‌స్తావా అని. వాడు చాలా యంగ్ క‌దా. వాడికి ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా.. ' అని సమాధానమిచ్చారు. దీంతో మెగా డాటర్ కామెంట్స్ నెట్టింట్లో తెగ  వైరల్అవుతున్నాయి. ఇక పవన ఫ్యాన్ మాత్రం తెగ సంతోషపడుతూ.. నిహరిక వీడియోను షేర్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఆకీరా ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: