దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన.. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన ఈ సినిమా.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏపీ, తెలంగాణలలో సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఓ సినిమా చేశారు అంటే.. ఒకప్పుడు నవ్వించడానికి మళ్లీ బ్రహ్మీ వచ్చారు అనేవారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల ఎంపిక విషయంలో కేవలం నవ్వులు మాత్రమే కాదు.. అంతకుమించి ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆయన నుండి వస్తున్న సినిమాల సంఖ్య తగ్గింది.. అలాగే ఆయన చేస్తున్న పాత్రల నిడివి కూడా తగ్గుతోంది. ఏదో బాగా పాత్ర నచ్చితేనో, లేక ఎక్కువగా అడిగితేనో ఆ పాత్రలు చేయడానికి ఆయన సిద్ధమవుతుండటమే కారణం.
అలాంటి బ్రహ్మానందం ఓ ఐదేళ్ల క్రితం ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సినిమా చాలాసార్లు ఆగీ, ఆగీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఆ సినిమానే 'ఉత్సవం'.
ఆ మధ్య కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా నటించి మెప్పించారు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో బ్రహ్మానందం అభినయానికి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. 

ఆ స్థాయిలో తన నటన విశ్వరూపం చూపించిన బ్రహ్మానందం మరోసారి తనలోని నటన ప్రతిభను 'ఉత్సవం' సినిమాలో చూపించబోతున్నారు. దిలీప్‌, రెజీనా హీరో హీరోయిన్‌ లుగా నటించిన 'ఉత్సవం' సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రంగస్థలం నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల అయిన టీజర్, పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మేకర్స్‌ చెప్పుకొచ్చారు.ఉత్సవంలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన దుర్యోధనుడి గెటప్‌ లో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం దుర్యోధనుడిగా భారీ డైలాగ్‌ చెబుతున్న నిమిషం వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది. బ్రహ్మానందం ను ఎక్కువగా కామెడీ సినిమాల్లోనే చూశాం. ఆయన్ను చిత్ర విచిత్రమైన హావ భావాలతో నవ్వించడం కోసమే దర్శకులు ప్రయత్నించారు. ఆయనలో ఉన్న గొప్ప నటుడిని చాలా మంది దర్శకులు పట్టించుకోలేదు. గతంలో బాబాయి హోటల్‌ సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్స్ పండించారు. ఆ తర్వాత ఎక్కువ నటించేందుకు స్కోప్ దక్కలేదు.ఇప్పుడు ఉత్సవం సినిమాలో బ్రహ్మానందానికి చక్కని అవకాశం దక్కిందని, నటుడిగా మరోసారి విశ్వరూపం చూపించే విధంగా పాత్ర ఉందని ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్‌ చెబుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: