యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తన మార్కెట్‌ని విస్తరించుకునేందుకు పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో వెళ్తున్నారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇప్పటికే ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. గ్లోబల్‌ వైడ్‌గా పేరు తెచ్చుకున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి మెప్పించారు. గ్లోబల్‌ ఆడియెన్స్ నుంచి ప్రశంసలందుకున్నారు. ప్రశంసలు వేరు, మార్కెట్‌ వేరు. ఇప్పుడు మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు.ఎన్టీఆర్‌ నార్త్ లో తనకంటూ మార్కెట్‌ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బాలీవుడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందే వార్‌ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.కాగా, బాలీవుడ్ లో డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకుండానే.. మరో బీటౌన్ ప్రొడ్యూసర్ నిర్మించే ప్రాజెక్టుకు గాను తారక్ ఛాన్స్ అందుకున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యలే.

దేవర ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర అని తెలిపారు. తాను నార్త్ లో దేవర మూవీని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా, గొప్పగా ఉందని చెప్పారు.అదే సమయంలో తనకు ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులు అయ్యారని తెలిపారు కరణ్ జోహార్. అందులో తారక్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. తమ రిలేషన్ కు ఇది ఎండింగ్ కాదని.. కొత్త బంధానికి నాంది అని పేర్కొన్నారు. తానేం చెబుతున్నానో తారక్ కు తెలుసు అని అన్నారు. అలా ఇన్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ తో మూవీ తీయనున్నట్లు తెలిపారు. దీంతో తారక్ అభిమానులు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెయిటింగ్ ఫర్ అన్న అప్డేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కరణ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.ప్రస్తుతం తారక్‌ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు.సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: