ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులు సైతం అన్ని భాషలలో నటించడానికి మక్కువ చూపుతున్నారు. అలా టాలీవుడ్ కి కూడా ఎంతో మంది బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్  నటీనటులు నటిస్తూ ఉన్నారు. కేవలం భాష నేర్చుకోవడానికి ఇబ్బంది తప్ప మిగతాదంతా కూడ స్పీడుగానే అయిపోతుంది. ముఖ్యంగా డబ్బింగ్ విషయానికి వస్తే ఇతరులతో చెప్పించడానికి కూడ పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నటీనటులు. బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన దీపిక కూడా మొదట డబ్బింగ్ తానే చెప్పిన తన వాయిస్ సెట్ కాకపోవడంతో చివరికి మార్చి ఇతరులతో చెప్పించారట.


ఇప్పుడు దేవర సినిమాలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు ,పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి.. ట్రైలర్ విడుదలవ్వగా ట్రైలర్ కాస్త మిక్స్డ్ టాకును తెచ్చుకుంది. దీంతో మరొక ట్రైలర్ ని రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తాందట. అయితే ఇందులో జాన్వీ కపూర్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా కోసం జాన్వీ డబ్బింగ్ చెప్పలేదట.. ఈ విషయాన్ని మనం డైలాగులు విన్న తర్వాత గమనించవచ్చు.


అయితే ఈ వాయిస్ ఎవరన్నది అన్న విషయం పై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు ఒక న్యూస్ వినిపిస్తోంది.. అదేమిటంటే జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ నేట. ఆమె వాయిస్ ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అనసూయ రంగస్థలం సినిమాలోని వాయిస్ ఇందులో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా అవుతోంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా అనసూయకు మంచి క్రేజ్ పెరుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన అటు అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: