తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో చాలామంది పాపులర్ కంటెస్టెంట్లతో పాటు సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఇప్పటికే ఒక వారం కూడ పూర్తి అయ్యింది. 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ ఒకటవ తేదీన బిగ్ బాస్ -8 మొదలయ్యింది. అయితే మొదటి 5 వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరి కొంతమంది ఎంట్రీ హౌస్ లోకి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మొదటివారం హౌస్ నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ కావడం జరిగింది. ఈమె వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే ఈమె పెద్ద ఎత్తున కొన్ని ఇంటర్వ్యూలు  కూడ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని విషయాలు తెలియజేసింది. ముఖ్యంగా నిఖిల్ చాలా తెలివైన వ్యక్తి అని హౌస్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ చాలా ప్లా సెట్ గా గేమ్ ఆడుతూ ఉంటారని తెలిపింది. బిగ్ బాస్ కార్యక్రమంకి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయకపోయినా.. వారం రోజులపాటు ఉన్నందుకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ మొత్తాన్ని సైతం బేబక్క విజయవాడ వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలియజేసింది.


సోషల్ మీడియా ద్వారా మంచి పాపులర్ కి సంపాదించుకున్న ఈమె ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి వచ్చింది.. అందుకే ఆ డబ్బుని మొత్తం విజయవాడ వరద బాధితుల కోసం ఖర్చు చేశామంటూ తెలియజేస్తోంది. బిగ్బాస్ హౌస్ లో బేబక్క నెగిటివిటీ లేకుండా బయటికి రావడం జరిగింది .ఎప్పుడూ కూడా కిచెన్ లో ఉండడం వల్ల తన వంటతో హౌస్మెట్స్ కడుపు నింపిన ఈమె ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈమె ఎలిమినేట్ కావడానికి ముఖ్య కారణం అని కూడా అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా తన వంతు సహాయంగా ఇలా చేయడం ప్రశంసలు అందుకునేలా చేస్తోంది బేబక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: