టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు అందుకోలేక ఫ్లాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ పూజ హెగ్డే.. దీంతో ఇతర భాషలలో కూడ నటించిన అక్కడ కూడా అవకాశాలు కలిసి రావడం లేదు. ఇప్పుడు మరొకసారి తన రూటును మార్చి సరికొత్త కథ అంశం వైపుగా అడుగులు వేస్తోంది పూజా హెగ్డే. హీరోగా డైరెక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన చిత్రాల ముని, గంగ, కాంచన వంటి చిత్రాలు ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలన్నీ కూడా ఆడియన్స్ ని భయపెట్టేలా చేశాయి.


అయితే ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత కాంచన-4 చిత్రాన్ని రాఘవ లారెన్స్ తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు  సంబంధించిన కథ కూడ పూర్తి చేశారని గత సినిమాలో మాదిరిగా ఈ చిత్రం కూడా అలరిస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు లారెన్స్ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే కాంచన-4 లో టాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డేను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ పరిశ్రమకు చెందిన గోల్డ్ మై మూవీస్ సంస్థ నిర్మిస్తోందట. ఈ చిత్రంలోనే కాకుండా రాఘవ లారెన్స్ హంటర్ అనే ఒక సినిమాను నిర్మిస్తోందట ఈ సినిమా.మొదటి ఈ చిత్రానికి నయనతార హీరోయిన్గా అనుకున్నప్పటికీ కానీ కొన్ని కారణాలవల్ల ఇప్పుడు మళ్ళీ పూజ హెగ్డే ని తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోందట. మరి ఈ విషయం పైన అడు పూజా హెగ్డే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ముఖ్యంగా వరుస ప్లావులతో సతమతమవుతున్న పూజా హెగ్డే కి ఈ హర్రర్ సినిమా కలిసి వస్తే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ధిమా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: