టాలీవుడ్‌ నటి హేమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఆధారాలతో అడ్డంగా బుక్కయింది టాలీవుడ్‌ నటి హేమ. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.  బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కర్ణాటక పోలీసులు.  టాలీవుడ్‌ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు పోలీసులు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9  మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి.    


టాలీవుడ్‌ నటి హేమతో  సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ నమోదు చేశారు పోలీసులు.  టాలీవుడ్‌ నటి హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు కర్ణాటక పోలీసులు. టాలీవుడ్‌ నటి హేమ ఫ్రెండు వాసు పార్టీకి పిలిచినట్లు నిర్ధారించారు పోలీసులు.  అంతేకాదు.... చిత్తూరు కు చెందిన డాక్టర్  రణధీర్ బాబు తో 9 మంది పై చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.  


వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్ తోపాటు నైజీరియన్ పైన అభియోగాలు నమోదు అయ్యాయి. బెంగుళూరు రేవ్ పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు పోలీసు అధికారులు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అరెస్టు చేశారు బెంగళూరు సిసిబి పోలీసులు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కు వచ్చారు.


1086 పేజీల తో కూడిన చార్జ్ షీటును  కోర్టుకు సమర్పించారు పోలీసులు. హేమ ఎండి ఎం ఏ డ్రగ్స్ తీసుకున్నట్లు నివేదికలను పొందుపరిచారు అధికారులు. ల్యాబ్ ఇచ్చిన నివేదికలో హేమ ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ తరునంలోనే... NDPS సెక్షన్ 27 కింద హేమా ను నిందితురాలిగా పేర్కొన్నారు పోలీసులు హేమా తో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: