ప్రముఖ సింగర్ గా పేరుపొందిన సింగర్ మనో.. ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సింగఆర్ మనో కుమారులు చేసిన పనికి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతోంది. వీరి పైన పోలీస్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.మరి వీటి గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం.


చెన్నైలో కృపాకరన్, వళసరవక్కం  ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారట. మంగళవారం రోజు రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తు ఉండగా హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు.. ఆ సమయంలో సింగర్ మనో కుమారులు రఫీ, షకీర్లతో పాటుగా వారి ఫ్రెండ్స్ 5 గురు అక్కడ ఉన్నారట. అయితే ఈ ఐదు మంది కూడా మద్యం మత్తులో ఉండడంతో కృపాకరంతోపాటు మరొక బాలుడితో గొడవ పడినట్లుగా సమాచారం. అలా ఈ గొడవ పెద్దది అవ్వడంతో ఈ ఘటనలో కృపాకరన్ కి గాయాలయ్యాయి దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.


సింగర్ మనో కుమారుల పైన వళసర వాక్కం.. రఫీ, షకీర్ వారి యొక్క స్నేహితుల పైన కూడా కేసు నమోదు చేయించారు. అయితే ఇందులో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయగా మరి కొంతమంది పరారీలో ఉన్నారు. వీరి పైన హత్య బెదిరింపులు బెదిరించడమే కాకుండా అసభ్యకరంగా కూడ ప్రవర్తించారని కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. పరారీలో ఉన్న వారిలో సింగర్ మనో కుమారులు కూడా ఉన్నారట. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.. ఈ విషయం విన్న సింగర్ మనో అభిమానులు ఆయన కుమారులను అసహ్యించుకుంటున్నారు. ఎంతోమంది దగ్గర మంచి పేరు సంపాదించుకున్న సింగర్ మనో తన కొడుకుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: