మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొంత కాలం క్రితం ప్రకటించింది. 

ఇకపోతే ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది. కానీ ఆ పోస్టర్లో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ను ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించలేదు. దానితో ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ ఈ డిసెంబర్ కు పూర్తి అయితాయా లేదా అసలు ఈ సినిమా డిసెంబర్లో విడుదల ఉంటుందా లేదా అనే సరికొత్త అనుమానాలు జనాల్లో రేకెత్తుతున్నాయి. ఏదేమైనా ఈ మూవీ బృందం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క ఈ సినిమాకి సంబందించిన ఓవర్సీస్ హక్కులను అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఫర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సంస్థ ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను ఈ సంస్థ అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: