ఇండస్ట్రీలో ఉన్న శృంగార తారలలో షకీలా కూడా ఒకరు..వ్యాంపు పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఈమె సినిమాలు విడుదలయితే చాలామంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి అప్పట్లో ఉండేదట. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆ కమెడియన్ తో కలిసి నేను ఆ రాత్రి ఒకే బెడ్ పై పడుకున్నాను..అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. మరి ఇంతకీ ఆ కమెడియన్ ఎవరా అనుకుంటున్నారా..ఆయన ఎవరో కాదు దివంగత కమెడియన్ వేణుమాధవ్..అవును మీరు వినేది నిజమే.. షకీలా కమెడియన్ వేణుమాధవ్ గురించి మాట్లాడుతూ.. మేము ఓ సినిమా షూటింగ్ సమయంలో అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళాము.
 ఆరోజు రాత్రి వేణుమాధవ్ రూమ్ లోకి నేను వెళ్లాను. ఎందుకంటే నా రూమ్ ని నా ఫ్రెండ్స్ అందరూ చెత్త చెత్త చేశారు. దాంతో వేణుమాధవ్ రూమ్లోకి వెళ్లాను. ఇక వేణుమాధవ్ కూడా ఆ రాత్రి అక్కడ పడుకోమని చెప్పారు.అలా ఇద్దరం కలిసి ఓకే బెడ్ పై పడుకున్నాము. కానీ కొద్దిసేపు అయ్యాక వేణుమాధవ్ మాట్లాడిన మాటలకు నేను షాక్ అయ్యాను. కాస్త హస్కీ వాయిస్ తో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. నువ్వు కాదనకూడదు అని నన్ను అడిగారు. దాంతో అసలు వాడు ఏం అడుగుతాడో అని భయంతో చచ్చాను. కానీ చివరికి రెండు పిల్లోలు తీసుకువచ్చి మా ఇద్దరి మధ్యలో పెట్టి ప్లీజ్ ఈ పిల్లోస్ ఇలాగే ఉండనివ్వు. నిద్రలో నువ్వు నామీద కాళ్లు వేస్తే ఇబ్బంది.

 నాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు. నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారు అని చెప్పాడు.ఇక వాడు ఏం చెప్తాడో టెన్షన్ తో భయపడి ఆరోజు షాకింగ్ లో ఉన్నాను. కానీ ఆ తర్వాత వేణు చెప్పిన మాటలకు నేను రాత్రి మొత్తం నవ్వుతూనే కూర్చున్నాను.ఇక ఇదే విషయాన్ని నేను ఉదయం అవ్వడంతోనే బ్రహ్మానందం వంటి వాళ్లకు చెప్పాను.దాంతో ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా నవ్వుకున్నారు. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుంది కదా అని వేణుమాధవ్ ని చూశాక నాకు అనిపించింది..అంటూ షకీలా వేణుమాధవ్ గురించి చాలా గొప్పగా చెప్పింది

మరింత సమాచారం తెలుసుకోండి: