టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ సినిమా ముందు వరకు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత నుండి వరుస విజయాలను అందుకుంటున్నాడు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను అందుకొని హైట్రిక్ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇలా ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తూ , ఓ సినిమాకు సిగ్నల్ ఇచ్చుకున్న బాలకృష్ణ మరి కొంత కాలంలోనే తన కొడుకును సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో అతనికి అనేక సూచనలు , సలహాలు ఇచ్చే క్రమంలో బాలకృష్ణ తన సినిమాలో స్పీడ్ ను కాస్త తగ్గించి కొడుకు కెరియర్ పై దృష్టి పెడతాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం తన కొడుకు గురించి పట్టించుకుంటూనే తన సినిమాలో స్పీడ్ ను అంతకుమించి జెట్ స్పీడ్ లో ముందుకు సాగిస్తున్నాడు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తూ , బోయపాటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్న బాలయ్య మరో దర్శకుడు మూవీ కి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్యమూవీ చేయడానికి బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో వీర సింహా రెడ్డి అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: