దర్శన్, పవిత్ర లు రేణుక స్వామి ని హత్య చేసిన వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. అయితే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్ర గౌడపై సంచలన ఆరోపణ చేసింది. నా భర్త వీడియోలు తీసి లొంగదీసుకుని బెదిరించింది అంటూ పవిత్ర గౌడ పై సంచలన కామెంట్లు చేసింది. అయితే తాజాగా రేణుక స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ  దర్శన్లపై 3991 పేజీల ఛార్జి షీట్ ని పోలీసులు పొందపరచారు... ఇక ఈ చార్జిషీట్లో దర్శన్ భార్య విజయ లక్ష్మి చెప్పిన మాటలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక అందులో పవిత్ర గౌడ పై విజయ లక్ష్మి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. దర్శన్ ప్రియురాలు పవిత్ర గురించి విజయ లక్ష్మి మాట్లాడుతూ.. పవిత్ర గౌడ ఎంటర్ కాకముందు  మా కాపురం ఎంతో హ్యాపీగా సాగిపోయింది. 

కానీ ఎప్పుడైతే పవిత్ర ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి మా కాపురంలో చిచ్చు పుట్టింది.. నా భర్త దర్శన్ పవిత్ర తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోస్ ని రహస్యంగా తీసి ఆమె దగ్గరికి రాకపోతే ఈ వీడియోలన్నీ బయట పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేసింది.అంతే కాదు ఈ బ్లాక్మెయిల్ తోనే నా భర్తను లొంగ దీసుకొని ఖరీదైన కార్లు,లగ్జరీ ఇల్లు, కోట్లకు కోట్ల డబ్బు కొట్టేసింది..

ఎప్పుడైతే పవిత్ర మా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందో అదే సమయంలో ఈ విషయం నాకు తెలిసి  దర్శన్ తో నేను గొడవపడ్డాను.. దాంతో దర్శన్ పవిత్రను పట్టించుకోకపోయేసరికి ఆమె చాలా బ్లాక్మెయిల్ చేసింది.. అంటూ విజయలక్ష్మి చెప్పినట్టు పోలీసుల చార్జిషీట్లో పొందపరచారు. ఏది ఏమైనప్పటికీ అంతా సజావుగానే సాగాలి అని విజయలక్ష్మి చివర్లో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తన భర్త పోలీస్ కేసు నుండి బయటికి రావాలని ఫేమస్ టెంపుల్ అయినటువంటి కామాఖ్య దేవాలయానికి వెళ్లి దర్శించుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: