నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు బ్యానర్ నుండి అనేక మంది దర్శకులు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులలో చాలా శాతం మంది దర్శకులు సూపర్ సక్సెస్ అయ్యారు. దిల్ రాజు బ్యానర్ నుండి సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి పెద్ద స్థాయిలో గుర్తింపును పొందని దర్శకులలో వాసు వర్మ ఒకరు. ఈయన మొదటగా దిల్ రాజు బ్యానర్లో నాగ చైతన్య హీరోగా జోష్ అనే మూవీ ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న వాసు వర్మ , దిల్ రాజు బ్యానర్ లో సునీల్ హీరోగా కృష్ణాష్టమి అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణాష్టమి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి గల కారణాలను వివరించాడు. దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... మా బ్యానర్ లో రూపొందిన జోష్ మూవీ ద్వారా వాసు వర్మ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఆ సినిమా కథ చాలా మంది కి నచ్చింది. ఆ తర్వాత ఆయనకు నేను రెండవ అవకాశం ఇచ్చాను. ఇక కోన వెంకట్ ఓ కథను చెప్పాడు. అది పక్కా కామెడీ ఎంటర్టైనర్ మూవీ.

అది నాకు నచ్చింది. వాసు వర్మ కూడా ఆ కథతో సినిమా చేద్దాం అన్నాడు. ఓకే అన్నాను. ఆ స్టోరీ కి హీరో ఓకే కావడానికి కాస్త సమయం పట్టింది. అంతలోపు మేము ఎందుకు ఖాళీగా ఉంటాం. ఆ కథను రకరకాలుగా మార్చాము. దానితో ఎంటర్టైన్మెంట్ స్టోరీ కాస్త వేరే రకంగా అయ్యింది. ఆఖరికి సునీల్ ని హీరోగా సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత సినిమాను రూపొందించి.. విడుదల చేశాం. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: