తెలుగు సినీ ఇండస్ట్రీలో రి రిలీజ్ ల హవా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ పద్ధతిని ఇప్పుడు అన్ని భాషలలో కూడ మారిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో మురారి, పోకిరి, జల్సా, గబ్బర్ సింగ్, ఇంద్ర తదితర చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ రాబడ్డాయి. రీ రిలీజ్ లలో కూడా కొన్ని కోట్ల రూపాయలు రాబట్టాయి. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలను కూడ రీ రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందాలు ప్లాన్ చేస్తున్నాయి. అలా ధనుష్ ఘోరంగా డిజాస్టర్ చూసిన 3 చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.


దాదాపుగా 12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ధనుష్, శృతిహాసన్ నటించారు. ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులోని వై దిస్ కొలవేరి పాట దేశం మొత్తం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ధనుష్ చిత్రం కోసం చాలానే కష్టపడ్డారని కూడ చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ సినిమాలో ధనుష్ స్కూల్ కుర్రాడిలా కూడా కనిపించడం కోసం చాలా వర్క్ అవుట్ లు చేశారట.కానీ అవేవీ కూడా ఈ సినిమాకి సక్సెస్ను తీసుకురాలేదు.


తెలుగు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయిన 3 చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారట..4k క్వాలిటీతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే తెలుగులో కొన్ని ముఖ్యమైన పట్టణాలలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. ఈనెల 14వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్న 3 సినిమాకి వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారట. ధనుష్ తమిళ స్టార్ హీరో అయ్యుండి కూడా తెలుగులో ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అంటే ఆశ్చర్యపోతున్నారు. అది కూడ డిజాస్టర్ సినిమాకి ఇంతటి బుకింగ్స్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: