సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ఇంటర్నెట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి ఎవరికీ తెలియని నిజం బయటకి వచ్చింది అంటే చాలు ఇక ఆ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.


 ఎంతోమంది హీరోయిన్లు తమ కెరియర్ లో ఎదురైన ఇబ్బందులను బయటకు చెప్పేవారు కాదు. అలా చెబితే ఎక్కడ కెరియర్ నాశనమై అవకాశాలు తగ్గిపోతాయేమో అని భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రమే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఇలా తమ కెరియర్లో ఎదురైన ఇబ్బందుల గురించి ఓపెన్ గా చెప్పడానికి వెనకడుగు వేయడం లేదు. దీంతో చాలా విషయాలు బయటకు వస్తూ సంచలనంగా మారిపోతున్నాయి. ఇటీవలే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఎన్నో రోజులుగా నెపోటీజం కొనసాగుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎంతో మంది స్టార్ల వారసులు, వారి ఫ్యామిలీకి చెందిన వారే బాగా రాణించేందుకు ఇక బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని తొక్కేస్తున్నారని.. ఇలాంటి నెపోటిజం వల్ల ఎంతోమంది గొప్ప నటులు కనుమరుగవుతున్నారంటూ అప్పుడప్పుడు వార్తలు కూడా వస్తుంటాయి.


 అయితే ఇలాంటి నెపోటిజం గురించి ఇటీవల స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు రకుల్ వెల్లడించింది. ఈ విషయంలో తాను ఎప్పుడో బాధపడలేదు అని చెప్పింది. స్టార్ కిడ్స్ కి సినిమాల్లో అవకాశాలు సులభంగా రావడానికి వారు పేరెంట్స్ పడిన కష్టమే కారణం. నేను కూడా నా పిల్లలకి ఫ్యూచర్ లో సహాయం చేస్తాను. లైన్ లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: