సినీ హీరో రాజ్ తరుణ్ గత రెండు నెలలుగా తన పేరు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి తనని వాడుకొని మోసం చేశాడని తన దగ్గర ఉండే డబ్బు బంగారాన్ని మొత్తం కాజేశారని పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేసాడంటూ ఆమె కేసు వేసినప్పటి నుంచి రాజ్ తరుణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రతో ఎఫైర్ పెట్టుకున్నారనే విధంగా ఆమె ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించి ముంబైలో రాజు తరుణ్ , మాల్వి మల్హోత్రా వీడియోని వైరల్ చేసింది లావణ్య.


దీంతో రాజ్ తరుణ్ నిజంగానే ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ హీరోయిన్  మాల్వి మల్హోత్రా కు క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ ,లావణ్య ఎఫెక్ట్ తాను నటించిన పురుషోత్తముడు, తిరగబడరా సామి తదితర చిత్రాల పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈరోజు కూడా రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడు సినిమా రిలీజ్ అయిన పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.


తాజాగా రాజ్ తరుణ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. మాల్వి మల్హోత్రా కు క్షమాపణలు చెప్పారు.. ముంబైలో జరిగిన సంఘటన తలుచుకుంటే తనకు బాధ వేస్తోందని.. చాలా అవమానంగా అనిపించిందని.. మీ ఇంటి దగ్గర ఇలాంటి సంఘటన జరిగినందుకు క్షమించమని కోరుకుంటున్నాను.. అయినప్పటికీ కూడా మీ స్నేహితులతో నీతో చేసుకున్న ఈ వినాయక పండుగ చాలా ఆస్వాదించాను.. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరికీ ఉంటాయి అంటూ మాల్వి మల్హోత్రాలను ట్యాగ్ చేస్తూ రాజ్ తరుణ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతున్నది. రాజ్ తరుణ్ ఎంత వీలైతే అంత త్వరగా లావణ్య విషయానికి పుల్ స్టాప్ పెడితే తప్ప బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: