రెజినా కసాండ్రా.. ఉత్సవం సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ  గతంలో బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటించింది.కానీ ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో కానీ రెజీనా కి ఆఫర్స్ రావడం లేదు. అయితే కొత్త హీరోయిన్లు రావడం వల్లనో ఏమో తెలియడం లేదు కానీ రెజినా క్రేజ్ టాలీవుడ్ లో తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. చివరిగా షాకిని డాకిని అనే మూవీతో రెజినా థియేటర్ లో కనిపించింది. ప్రస్తుతం ఉత్సవం మూవీ తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఉత్సవం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన రిలేషన్స్ గురించి ఓపెన్ గా చెప్పేసింది.. రెజీనా మాట్లాడుతూ.. నేను రిలేషన్ లో ఉన్నాను నిజమే.చాలామందితో రిలేషన్ లో ఉన్నాను. అయితే ఆ రిలేషన్స్ నుండి బయటపడి ప్రస్తుతం నేనైతే సింగిల్ గానే ఉంటున్నాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

 అయితే సాయి ధరంతేజ్,సందీప్ కిషన్ లతో వచ్చిన ఎఫైర్ వార్తలు నిజమేనా అని యాంకర్ రెజీనాని అడగగా.. అలాంటివి ఏమీ లేదు.కానీ సందీప్ కిషన్ నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటాం కలిసిపోతాం. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అయితే ఏమీ లేదు. ఇక సాయి ధరంతేజ్ చాలా సైలెంట్.. ఆయనతో కూడా అలాంటి రిలేషన్ ఏమీ లేదు అంటూ చెప్పింది. కానీ రెజీనా మాత్రం సాయిధరమ్ తేజ్ తో ప్రేమలో ఉందని  టాలీవుడ్ మీడియా టాక్.

ఫిలిం సర్కస్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సాయిధరమ్ తేజ్,రెజీనా ఇద్దరు ప్రేమలో ఉన్నారని,అయితే వీరి ప్రేమ విషయం మెగా ఫ్యామిలీకి కూడా తెలుసని,త్వరలోనే ఈ జంట కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది. కానీ అందరిలాగే వీళ్ళు కూడా పెళ్లంటే ఇష్టం లేదు..ఇప్పుడే పెళ్లి చేసుకోమని మాటలు దాటేస్తున్నట్టు సమాచారం.ఏది ఏమైనప్పటికీ రెజీనా సాయి ధరమ్ తేజ్ కి భార్య అయితే అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి రెజినా సాయి ధరంతేజ్ ని నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేక గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుందా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: