మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ’మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.  కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్నాయి.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 ఇదిలవుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్నాడు. ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే.. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఎక్సయిటింగ్‌ అప్‌డేట్‌ను అందిస్తామని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే మట్కా ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోగా..

 ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ రూ.3.6 కోట్ల భారీ మొత్తానికి రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ సినిమా కోసం మేకర్స్‌ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్‌ వైజాగ్‌ లొకేషన్స్‌ డిజైన్‌ చేసిన విషయం తెలిసిందే.  కాగా నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: