ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. rrr సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ట్రైలర్ లాంచ్ కి ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దేవర ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా చేయనున్నారు. ఆ తర్వాత ముంబైలో రిలీజ్ కి ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారట. ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాతుకుపోవడానికి, అక్కడ మార్కెట్ తెచ్చుకోడానికి బాగానే కష్టపడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు దేవర తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. 

ఇక ఈనెల 27న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ దేవర కంటే ముందు ఆచార్య సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీని ప్రభావం దేవరపై నిన్న మొన్నటి వరకు పెద్దగా కనిపించకపోయినా.. తాజాగా రిలీజ్ అయిన దేవర ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు తగ్గాయి. దేవర ట్రైలర్ చూస్తే ఆచార్య సెగలు కనిపిస్తున్నాయి అంటూ కథ రొటీన్‌గా అనిపిస్తుంది అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షాక్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యేలా ఉంది అన్న వార్తలు వినిపించాయి.

దీంతో ఒక్కసారిగా దేవరను ఆడియన్స్ చూసే కోణం అంతా మారిపోయింది. ఈ సినిమా అనుకున్నంత బ్లాక్‌బస్టర్ సక్సెస్ దక్కదేమో.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనాలైతే కష్టమే అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఇలా అంచనాలు తగ్గిపోవడం మంచిదా.. కాదా.. అన్న చర్చ ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్ గా ఉంది. ఓ రకంగా ఇది దేవరకు మంచిదే అన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ను డ్యూయెల్‌ రోల్‌ లో చూపించబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్‌ చేసిన సినిమాల ఫలితాలు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: