నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తాను చాటుతోంది. గిల్లి అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రకుల్ ఆ తర్వాత వివిధ భాష సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమాలో తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్సినిమా అనంతరం వెనుతిరిగి చూసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు తన హవాను చాటుకుంది.


తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రకుల్ నటుడు జాకీ భగ్నానీని జనవరి నెలలో వివాహం చేసుకుంది. వివాహ అనంతరం తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమా ప్రాజెక్టులు ఏమీ లేకపోవడం బాధాకరం. అయితే రకుల్ తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. అక్కడ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోతుంది. దీంతో రకుల్ అభిమానులు మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.


ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఒకానొక సమయంలో ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఓ కారణం వల్ల అతనికి బ్రేకప్ చెప్పానని తెలిపింది. ఆహారం విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, ఆహారాన్ని గౌరవిస్తానంటూ పేర్కొంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటానని వెల్లడించింది. హెల్దిగా ఉండాలని ఒక సంవత్సరం పాటు శాకాహార భోజనం తిన్నానని చెప్పింది.


అలాంటిది అతడు ఫుడ్ గురించి చాలా చులకనగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఒకరోజు మేము ఇద్దరం కలిసి హోటల్ కి వెళ్ళాము. అతడు అక్కడ ఆర్డర్ చేసిన ఫుడ్ పక్కన పెట్టి మళ్ళీ ఫ్రైడ్ ఫుడ్ ఆర్డర్ చేశారని తెలిపింది. కానీ అలాంటి ఫుడ్ నాకు నచ్చలేదు. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని ఒక వ్యక్తి నాకు అవసరం లేదని అనిపించింది. దీంతో అతనికి బ్రేకప్ చెప్పానని సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రకుల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: