యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో ఆకట్టుకుంటోంది. అక్కడక్కడ కాస్త నెగటివ్ ట్రోల్స్ వినిపిస్తున్న అభిమానులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ కి జోడిగా మొదటిసారి జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే మొదటిసారిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే దేవర సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం వేగవంతంగా పాల్గొంటోంది.



ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి అభిమానులలో ఆనందపడేలా ఒక న్యూస్ వినిపిస్తోంది. హాలీవుడ్ లో జరుగుతున్న అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ లో దేవర చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్ జరుగుతున్న అతిపెద్ద జాన్ ఫిలిం ఫెస్టివల్ 2024 కి సంబంధించి జరగబోతోంది. అక్కడ థియేటర్లో దేవర సినిమా సెప్టెంబర్ 26 సాయంత్రం ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న అభిమానులు అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇప్పటివరకు చాలా మంది కావాలని ట్రోల్స్ చేసిన వారికి ఇది సరైన షాక్ అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. చాలామంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నారట. ఇందుకోసం సెప్టెంబర్ 25న జూనియర్ ఎన్టీఆర్ కూడ అమెరికాకు వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానులు మరింత సంబరపడుతున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే దేవర సినిమా 40 నిమిషాల చివరిలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడింది. మరి హాలీవుడ్లో ప్రదర్శన అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసిన వారందరూ ఎలా స్పందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: