నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తోనూ భగవంత్ కేసరి మూవీ తోనూ విజయాలను అందుకున్నాడు. దానితో ఇప్పటికి వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఫుల్ జోష్లో బాలయ్య ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను "N B K 109" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో బాలయ్య హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య తన నెక్స్ట్ రెండు మూవీ లకు పూర్వం తనకు మంచి విజయాలు ఇచ్చిన దర్శకులను ఎంచుకున్నాడు.

ఇప్పటి వరకు బోయపాటి , బాలయ్య కు మూడు విజయాలను అందించగా , గోపీచంద్ మలినేని "వీర సింహా రెడ్డి" తో ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తనకు మంచి విజయాలను ఇచ్చిన దర్శకులను ఎంచుకుంటూ బాలయ్య సేఫ్ గా మరిన్ని విజయాలను అందుకునే దిశగా కెరీర్ ను ముందుకు సాగించే విధంగా పయనిస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: