రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా సరైన అప్డేట్స్ లేవు. ఒక్క సాంగ్ మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ షూట్ ఇంకా జరుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం చరణ్ అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. రిలీజ్ ఎప్పుడంటే మూవీ టీమ్ ఎవరూ మాట్లాడట్లేదు. పోనీ అప్డేట్ ఇమ్మని అడుగుతున్నా సైలెంట్ గానే ఉంటున్నారు.గతంలో నిర్మాతలు ఏదో ప్రెస్ మీట్ లో చెప్తూ సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అభిమానులకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా 10 నుంచి 15 రోజుల షూట్ మిగిలే ఉంది. త్వరలోనే ఆ షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వాలి. అప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేస్తాం అని తెలిపాడు. దీంతో ఏ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదు, అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా అని రామ్ చరణ్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు వస్తుందో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుకే తెలియాలి.అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అప్పటికీ నిర్మాత దిల్ రాజు ఎట్టిపరిస్దితుల్లోనూ గేమ్ ఛేంజర్ సినిమాని క్రిస్మస్ 2024 న రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఫైనల్ అవుట్ ఫుట్ మరో రెండు నెలల్లో వస్తుందనే నమ్మకం అయితే లేదట.

ఇప్పుడు దర్శకుడు శంకర్ చాలా ప్రెజర్ లో ఉన్నారట. భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్ అవటం ఆయన ఊహించలేదు. దాంతో ఆయన గేమ్ ఛేంజర్ తో ఛాన్స్ తీసుకోలేదలుచుకోలేదని చెప్తున్నారు.ఎట్టి పరిస్దితుల్లోనూ శంకర్ కు గేమ్ ఛేంజర్ రూపంలో బ్లాక్ బస్టర్ దొరకాలి. అందుకే ఆయన అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ అదే పనిపై ఉంటున్నారని తెలుస్తోంది.ఈ విషయం అర్దం చేసుకున్న దిల్ రాజు ఏమీ మాట్లాడలేకపోతున్నారట. కొన్ని రీషూట్స్ అన్నా సరే అంటున్నారు. రామ్ చరణ్ కూడా డైరక్టర్ శంకర్ కే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.అందుతున్న సమాచారం మేరకు శంకర్ ప్రస్తుతానికి అవుట్ ఫుట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యాక డబుల్ చెక్ చేసుకుని మరీ రిలీజ్ డేట్ ఖరారు చేద్దామని చెప్పారట.అందుకు దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఓకే చెప్పారట. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రస్తుతం క్రిస్మస్ కు వస్తుందా లేదా అనేది 50-50 ఛాన్స్ అని చెప్పాలి. క్రిస్మస్ కు రాకపోతే ఇక వచ్చే సంవత్సరమే రిలీజ్.వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చరణ్‌ నుంచి సినిమా రాలేదు కాబట్టి ఆయన ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గేమ్ ఛేంజర్ పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమా సెట్స్‌లో చరణ్ అడుగుపెట్టాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: