టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సాయి పల్లవి చివరిగా 2022లో వచ్చి గార్గి మూవీలో నటించింది. గతేడాది ఆమె నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు అమరన్ అనే తమిళ మూవీ కూడా ఈ ఏడాదే రానుంది. ఇవే కాకుండా హిందీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఇదిలవుండగా తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.. వినీత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి

 తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లికి సాయి పల్లవి కూడా తెల్ల చీరలో ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ ఏడాది జనవరిలో పూజా, వినీత్ నిశ్చితార్థం జరిగింది. అప్పుడు కూడా సాయి పల్లవి ఇలాగే చెలరేగిపోయి డ్యాన్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో తెలుగు కు గ్రీన్ సింగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో మూడో సారి జతకట్టనుంది సాయి పల్లవి. అలాగే తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో ఈ ఉండనుందని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

 ఆయన దర్శకత్వంలో సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ లు చేసింది. ఈ రెండు లు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ ప్లాన్ చేస్తున్నారు. ఈ లో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. కాగా నాని, సాయి పల్లవి కలిసి ఎమ్.సీ.ఏ, శ్యామ్ సింగరాయ్ లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: