విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి దుర్గ తేజ్‌ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే, మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత నటించిన విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు. అనంతరం బ్రో సినిమా యావరేజ్‌గా నిలిచిన కలెక్షన్లతో

 సత్తా చాటింది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కోసం ఓ యాంకర్ పాట పాడిన పడింది.  తన కెరీర్ లో ఎప్పుడు సింగర్ అవతారమెత్తని ఆమె తేజ్ కోసం ఓ స్పెషల్ సాంగ్ ను పాడింది. అంతే కాదు ఆ సాంగ్ కు మరో యాంకర్ డాన్స్ కూడా చేసింది. తేజ్ హీరోగా నటించిన ఆ ఫ్లాప్ అయినా.. పాట మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకూ ఆ ఏది.? ఆ యాంకర్స్ ఎవరు.? అనేది చూద్దాం.! గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ అనే సినిమా  తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా  లో తేజ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

 ఇక ఈ సినిమా  లో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటను మరో స్టార్ యాంకర్ సుమ కనకాల ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించిన సుయ సుయ అనే సాంగ్ ను సింగర్ అనురాగ్ కులకర్ణితో కలిసి సుమ ఆలపించారు. తన కెరీర్ లో మొదటి సారీ తేజ్ కోసం సుమ పాట పాడారు. ఈ సినిమా  నిరాశ పరిచిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక సుమ పలు సినిమా ల్లోనూ నటించారు. చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె.. మొన్నామధ్య జయమ్మ పంచాయితీ అని ఓ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: