తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టిస్తున్న ప్రాజెక్ట్‌లలో రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణం చిత్రం ఒకటి. దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం  తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందట మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రాకింగ్ స్టార్ యష్ రావణ్ పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.  ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం గురించి కొన్ని క్రేజీ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ చిత్రం రామాయణం మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నప్పటికీ, కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు

 తెలుస్తోంది. దర్శకుడు ఈ కథను ఆధునిక యుగానికి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఎప్పుడు నుంచో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తయి నట్టు తెలుస్తుంది. కాగా అవును ఇది నిజమే అంటూ బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేజర్ గా అవుట్ డోర్ లో షూటింగ్ చేయలేదు కానీ ఈ సినిమాను దాదాపు స్టూడియో లోనే పూర్తి చేసేసారట. ఇలా నటీనటులకు సంబంధించిన  పార్ట్ వరకు షూటింగ్ మొత్తం  కంప్లీట్ అయ్యిపోయిందట. ఇక సినిమా వి.ఎఫ్.ఎక్స్ పనులే బ్యాలెన్స్ ఉన్నాయని

 చెప్పవచ్చు. ఇక చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై భారీ చర్చ జరుగుతోంది. రణబీర్, సాయి పల్లవిల కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. చిత్రం పై అంచనాలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా. రణబీర్ కపూర్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్  “అనిమల్” సినిమా తర్వాత మళ్ళీ రామాయణం సినిమా తో తేర మీదకి వస్తుండడం తో ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: