ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు యూ ఎస్ ఏ లో భారీ ఎత్తున రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా యూ ఎస్ ఏ లో అద్భుతమైన కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా తెలుగు సినిమాలు రాబడుతున్నాయి. మరి ఇప్పటి వరకు యూ ఎస్ ఏ లో అత్యధిక కలెక్షన్లను భాగంగా వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

గబ్బర్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా 66.186 డాలర్లను చేసి మొదటి స్థానంలో నిలిచింది.

ఇంద్ర : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయింది. ఈ మూవీ 65.720 డాలర్లను వసూలు చేసింది.

మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయింది. ఈ సినిమా యూ ఎస్ ఏ లో 60.642 డాలర్లను వసూలు చేసింది.

సింహాద్రి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యూ ఎస్ ఏ లో భాగంగా 59.843 డాలర్లను వసూలు చేసింది.

చెన్నకేశవ రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శ్రేయ , టబు హీరోయిన్లుగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యూ ఎస్ ఏ లో 51.129 డాలర్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: