దివంగత నటి శ్రీదేవి బాలనాటిగా తన కెరీర్ ని మొదలుపెట్టి చనిపోయే వరకు కూడా సినిమాల్లోనే ఉంది.. బంధువుల పెళ్ళికని దుబాయ్ కి వెళ్లిన శ్రీదేవి బాత్ టబ్  లో మునిగి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇక శ్రీదేవి మరణం లో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు అభిమానులతో పాటు చాలామంది ఇండస్ట్రీ జనాలు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తిండి విషయంలో కఠినమైన డైట్ పాటించడం వల్లే అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేదట.అలా బాత్ టబ్ లో ఉన్న సమయంలో స్పృహ కోల్పోయి అందులోనే పడి నీటిలో మునిగి చనిపోయిందని బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


అయితే శ్రీదేవి హీరోయిన్ల మీద కుళ్లుతో చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుందట.. ఇక విషయంలోకి వెళ్తే.. దివంగత నటి శ్రీదేవి  చిన్నప్పటినుండి మేకప్ వేసుకొని ఇండస్ట్రీలో రాణించడం వల్ల ఆమెకు మేకప్ పిచ్చితో పాటు ఎప్పటికీ ఇండస్ట్రీలో యంగ్ గానే 20 ఏళ్ల అమ్మాయిలా కనిపించాలి అనే ఆలోచన ఉండేదట. ఇక తనకంటే ఎక్కువ ఆఫర్స్ వేరే హీరోయిన్ లకి వెళ్తే అస్సలు జీర్ణించుకునేది కాదట. వాళ్లకంటే నాకేం తక్కువ అని కుళ్లుకునేదట. ముఖ్యంగా కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు వస్తే వారి కంటే ఎక్కువ యంగ్ గా కనిపించడం కోసం  డైటింగ్, వ్యాయామం చేసేదట.


అలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని ఆహారం విషయంలో కఠినమైన డైట్ పాటించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు శ్రీదేవి కి వచ్చాయట. అంతే కాకుండా బోనీ కపూర్ శ్రీదేవి తన ఇద్దరు కూతుర్లకు కలిపి ప్రతి రోజు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు చేసేవారట. అలా కఠినమైన డైటింగ్ పాటించడంతో శ్రీదేవికి హై డయాబెటిస్, హైపర్ టెన్షన్,బీపీ వంటి ఎన్నో వ్యాధులు వచ్చాయట. అవకాశాల కోసం చూస్తూ చివరికి డైటింగ్ కారణంగా తన ప్రాణం మీదికి తెచ్చుకుంది.


శ్రీదేవి వయసు మీద పడ్డాక అవకాశాలు తగ్గడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందట. అలా తన ఆలోచనలే తన ప్రాణాల మీదికి తీసుకువచ్చాయి అంటూ శ్రీదేవికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు సినీ నటుడు,రచయిత అయినటువంటి తోటపల్లి మధు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: