2019లో వచ్చిన  సినిమా మత్తు వదలరా చిత్రం సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మత్తు వదలరా-2 సీక్వెల్ కూడా నిన్నటి రోజున థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఏ చిత్రాన్ని నిర్మించారు. హీరోగా శ్రీ సింహ ఫరియా అబ్దుల్లా, వెన్నెల, కిషోర్, రోహిణి ,సత్య తదితర నటి నటులు ఇందులో నటించారు. ఈ సినిమా క్రైమ్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.



మత్తు వదలరా-2 చిత్రం థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోందని ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ కూడా ఈ సినిమాకి హైలెట్గా నిలిచిందని దీంతో ప్రేక్షకులు ఈ చిన్న సినిమాకి బ్రహ్మరథం పట్టినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 5.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తమ ట్విట్టర్ నుంచి తెలియజేసింది.

మత్తు వదలరా సినిమా వీకెండ్ ముగిసేసరికి కచ్చితంగా 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చిత్ర బృందం బాగానే ప్రమోషన్ చేసింది. మత్తు వదలరా మొదటి భాగానికి మించి రెండవ భాగం మరింత హిట్ అయిందని రుజువు చేసింది. ఈ సినిమాలో సత్య కామెడీ హైలెట్గా నిలవడమే కాకుండా ఫరియా అబ్దుల్లా నటన కూడా అద్భుతంగా ఉండడమే ఈ సినిమాలకు ప్లస్ అయింది అలాగే హీరో శ్రీ సింహ కూడా అద్భుతంగా నటించారు. ఎన్నో చిత్రాలు శ్రీ సింహ నటించిన అవన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి మళ్ళీ మత్తు వదలరా-2 ఇద్దరంతో సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ రితేష్ రానా కూడా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: