టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన నటి శోభిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకుంది. శోభిత సినిమాలకన్నా కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం నుంచే రిలేషన్ కొనసాగిస్తున్నట్లు ఎన్నో రకాల రుమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించని వీరు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు.


ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే వీరి వివాహం కోసం కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారట. అయితే వీరి వివాహం ఎప్పుడూ అనేది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శోభితకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. శోభిత మొదట్లో మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మోడల్ గా ఉన్న సమయంలో శోభిత ప్రణవ్ మిశ్రా అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపించిందట. ఇతను ఎవరో కాదు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ కో ఫౌండర్.


అయితే ఓ ఫ్యాషన్ షోలో వీరిరువురూ కలుసుకొని మంచి స్నేహితులుగా మారారు. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరు ఏవో కొన్ని మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది.


కాగా... టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన నటి శోభిత దూళిపాళ్ల.. ఏపీకి చెందిన అమ్మాయిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన నటి శోభిత కుటుంబానికి బాగానే ఆస్తులు ఉన్నాయి. అయితే.. శోభిత మాత్రం.. బాలీవుడ్‌ లో ఎక్కువగా పాపులర్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: