కొన్ని సంవత్సరాల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో చెన్న కేశవ రెడ్డి అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమా ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను తెచ్చుకుంటుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు.

ఇక ఈ సినిమాలో తండ్రి పాత్రకు నటించిన బాలకృష్ణ సరసన టబు హీరోయిన్గా నటించగా ... కొడుకు పాత్రలో నటించిన బాలకృష్ణ కు జోడిగా శ్రేయ నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వినాయక్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా చెన్న కేశవ రెడ్డి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వినాయక్ మాట్లాడుతూ ... చెన్న కేశవ రెడ్డి సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో నటిస్తాడు. ఇక ఒక పాత్రలో తండ్రిగా కనిపిస్తాడు. ఈ పాత్రలో బాలకృష్ణ కు జోడిగా టబు నటించింది. మొదట ఈ పాత్రకు టబు ను కాకుండా సౌందర్య ను అనుకున్నాను.

అందులో భాగంగా ఆమెకు వెళ్లి కలిసి కథను కూడా వివరించాను. కథ మొత్తం విన్న ఆమె స్టోరీ భాగానే ఉంది. కానీ ఇప్పుడే సీనియర్ పాత్రలలో నటించాలి అనుకోవడం లేదు. అందుకే ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో వినాయక్ ఏమీ చేయలేక సైలెంట్ గా వచ్చేసాడట. ఆ తర్వాత టబు ను ఆ పాత్ర కోసం సంప్రదించడం జరిగినట్లు , ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినాయక్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: