తెలుగులో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ పోషించిన నటి ప్రియమణి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన నటన, అందం, అభినయంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. సినిమాల పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా చాలా క్లారిటీతో ముందుకు వెళుతూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. సరిగ్గా సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసుకుని ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.


అటు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కొన్ని రియల్ షోస్ లో కనిపించి మెప్పిస్తుంది. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన ప్రియమణి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను తన అభిమానులతో పంచుకొని వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ప్రియమణి సంబంధించి ఓ వార్త బైరల్ గా మారుతుంది. ప్రియమణి ఒకప్పుడు లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన తరుణ్ తో ప్రేమలో పడిందట.


సినిమాలో నటిస్తున్న సమయంలో అతని చుట్టూ లవ్ ఎఫైర్లు బాగానే నడిచాయి. అయితే అందులో ప్రియమణి పేరు ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. తాజాగా తరుణ్, ప్రియమణి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని బయట పెట్టింది ఎవరో కాదు స్వయంగా ప్రియమణి. తరుణ్ తో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. తరుణ్ తో నవవసంతం అనే సినిమా చేసింది ప్రియమణి. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయట. స్వయంగా తరుణ్ తల్లి రోజా రమణి సెట్స్ లో ప్రియమణి వద్దకు వచ్చి మీరిద్దరూ ప్రేమించుకుంటే చెప్పమని కోరిందట.


ఇద్దరికీ పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. రోజా రమణి వచ్చి తనతో చెప్పే వరకు తరుణ్ కు తనకు మధ్య ప్రేమ వార్తలు వస్తున్నాయనే విషయం కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తరుణ్ తల్లిగారు అలా అంటుంటే నాకు చాలా నవ్వొచ్చిందని, వెంటనే మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పుకున్నానని ప్రియమణి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: