Iffa -2024 ఉత్సవానికి ప్రస్తుత రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజలు సైతం ఇందులో పాల్గొనబోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, బాలకృష్ణ తదితర నటీనటులు సెప్టెంబర్ 27న అబుదాబి ఐస్లాండ్ కి వెళ్ళబోతున్నారు.. రామ్ చరణ్ అతిధిగా ఈవెంట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే ఈవెంట్ లో అటు చిరంజీవి ఇటు రాంచరణ్ రావడంతో మెగా అభిమానులకు మరొకసారి ఆనందాన్ని కలిగిస్తోంది.


ఐఫా ఈవెంట్ లో హీరోయిన్ సమంత ని కూడ సత్కరించబోతున్నారట. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమాకి సంబంధించి సమంతకు ఈ అవార్డు దక్కబోతోంది. Iffa కు సమంత ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తోంది. ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ వంటి వారు ఈ వేదిక పైన ప్రత్యేకంగా కనిపించనున్నారట .అయితే వీరందరూ కూడా ఇండియన్ సినిమా ను ప్రపంచ స్థాయికి ఎదగడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ వేడుక భారతీయ సినీ పరిశ్రమలోనే ఎంతోమంది సూపర్ స్టార్స్ విలక్షణమైన వేడుకగా మారనుందట.


Iffa వేడుకకు ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. IFFA ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ స్టన్నింగ్ అపీరియన్స్ ఉండబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. అలాగే ఈ వేడుకకు సైతం ఐశ్వర్యరాయ్ మణిరత్నం తదితరులు రాబోతున్నారట. అలాగే విక్రమ్, కమలహాసన్, రిసాబ్ శెట్టి తదితర హీరోలు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రామ్ చరణ్ కు ఇలాంటి అరుదైన అవకాశం రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ చరణ్ చివరిగా rrr చిత్రంతో అలరించిన ఈ సినిమా తర్వాత గేమ్ చేంజర్ సినిమాని మొదలుపెట్టారు ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.. ఈ చిత్రం అయిపోగానే డైరెక్టర్ బుచ్చిబాబు సన తో సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: