2011 వ సంవత్సరం ఎంగేయుమ్ ఎప్పోదుమ్ అనే టైటిల్ తో తమిళ్ లో ఓ మూవీ రూపొందింది. ఈ సినిమాలో శర్వానంద్ , జై , అనన్య , అంజలి ప్రధాన పాత్రలలో నటించారు. ఎం. శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే మంచి అంచనాలు నడుమ తమిళ్ లో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తమిళ్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాను ఆ తర్వాత కొంత కాలానికి జర్నీ అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. 

మూవీ తో శర్వానంద్ , జై , అనన్య , అంజలి అందరికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ద్వారా అంజలి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఈ సినిమా తర్వాత అంజలి కి తెలుగు లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా తర్వాతే ఈమె తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన నటిగా మారిపోయింది. ఇకపోతే ఆ సమయంలో మంచి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ సినిమాను సెప్టెంబర్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని ఏ ఆర్ మురుగదాస్ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: