తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించిన వారి లో లయ ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమంలో చాలా సంవత్సరాల పాటు కెరియర్ను విజయవంతం గా కొనసాగించింది . ఇకపోతే ఈమె కొన్ని సంవత్సరాల క్రితం సాయి కిరణ్ హీరోగా రూపొందిన ప్రేమించు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈమె అంధురాలి పాత్రలో నటించింది. ఇక అందురాలి పాత్రలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇకపోతే సాయి కిరణ్ తాజాగా ఇంటర్వ్యూ లో భాగంగా లయ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సాయి కిరణ్ , లయ గురించి మాట్లాడుతూ ... లయ , నేను కలిసి ప్రేమించు సినిమాలో నటించాం. ఇక మా జంటకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి వచ్చాయి. అలాగే మా తల్లి దండ్రులు కూడా జంట బాగుంది , వీరిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అలాగే లయ తల్లిదండ్రులు కూడా అలాగే భావించారు. కానీ ఆ తర్వాత జాతకాలు కలవలేదు. దానితో ముందుకు అడుగు వేయలేదు. అంతేతప్ప మేమిద్దరం ఎప్పుడు ప్రేమించుకోలేదు.

కాకపోతే మా పెద్దవాళ్ళు అనుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. కానీ జాతకాలు కలవలేదు , దానిని అక్కడే వదిలేశాం. మేమిద్దరం అప్పుడు మంచి స్నేహితులమే , ఇప్పుడు మంచి స్నేహితులమే.  అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు అని సాయి కిరణ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం సాయి కిరణ్ అనేక సీరియల్ లలో నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: