కొంత మందికి ఎన్నో సినిమాల లో నటించిన రాని క్రేజ్ మరి కొంత మంది బ్యూటీలకు మాత్రం ఒకే ఒక సినిమాతో వస్తుంది . అలా ఒకే ఒక సినిమాతో ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ లలో త్రిప్తి డిమ్రి ఒకరు . ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది . ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ ఉన్న కాస్త సమయంలోనే ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

దానితో ఈ సినిమా వల్ల ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఇక ప్రస్తుతం ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఒక్కో సినిమాకు ఈమె భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. యానిమల్ మూవీ కి 40 లక్షల వరకు పారితోషకం తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం దాదాపు 80 లక్షల వరకు ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె సినిమాల ద్వారా భారీ మొత్తంలో ఆస్తులను కూడా కూడా పెట్టినట్టు తెలుస్తుంది.

ఈమెకు గ్రౌండ్ ప్లేస్ రెండు అంతస్తుల భవనం ఒకటి ఉన్నట్లు దాని విలువ ఏకంగా 14 కోట్లు అని తెలుస్తోంది. అలాగే మరికొన్ని ఆస్తులు కూడా ఈ ముద్దుగుమ్మకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మకు బోలెడన్ని ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈమె ప్రస్తుతం ఒక్కో మూవీ కి పెద్ద మొత్తంలో పారితోషకం కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Td