కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . విజయ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు . విజయ్ ఇండియాలోనే అందరు హీరోల కంటే ఎక్కువ పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రెండు పాత్రలలో విజయ్ నటించాడు.

ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి స్నేహ జోడిగా నటించింది. కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి జోడిగా నటించింది. ఈ మూవీ కోసం విజయ్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. ఇప్పటి వరకు 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరో విజయ్ అని కూడా ఓ వార్త వైరల్ అయింది. ఇక 200 కోట్లతోనే రికార్డు సృష్టించిన విజయ్ మరో సరికొత్త రికార్డును తాజాగా సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. దానితో ఈయన ఆఖరుగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

విజయ్ తన ఆఖరి మూవీ ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 275 కోట్ల పారితోషకాన్ని విజయ్ తీసుకుపోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా సినిమా సినిమాకు విజయ్ తన  పారితోషకాన్ని భారీగా పెంచుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: