ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించారు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది.

కొంత కాలం క్రితం ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక అందుకు అనుగుణంగా ఈ మూవీ బృందం ప్రచారాలను కూడా మొదలు పెట్టడంతో ఈ సైనా ఆగస్టు 15 వ తేదీన కచ్చితంగా విడుదల అవుతుంది అని జనాలు భావించారు. కానీ ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి అక్టోబర్ చివరి వరకు డెడ్ లైన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ చివరి వరకు కచ్చితంగా ఈ సినిమా మొత్తం షూటింగ్ను పూర్తి చేయాలి అని అల్లు అర్జున్మూవీ యూనిట్ కి సూచించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ఈ సినిమా షూటింగ్ కనుక పెండింగ్ ఉన్నట్లు అయితే ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa