సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈమె మరణం ఇప్పటికే కూడా ఒక మిస్టరీనే.. శ్రీదేవి భర్త భోనికపూర్ ఆమె మరణానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ముఖ్యంగా ఆహార విషయంలో డేటింగ్ విషయంలో చాలా నియమాలను పాటించడం వల్లే.. దుబాయిలో బంధువుల వివాహానికి వెళ్ళినప్పుడు.. టబ్ బాత్ లో స్నానం చేస్తూ కోమాలకు వెళ్లి మరణించిందనే విధంగా తెలియజేశారు.


కానీ శ్రీదేవి మరణించిన తరువాత కొన్నేళ్లపాటు ఈమె మరణం గురించి ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉండేవి.. ముఖ్యంగా వినిపించిన విషయం ఏమిటంటే శ్రీదేవి మీద 100 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఉందని వారి కోసమే తన భర్త ఈ పని చేసి ఉంటాడని రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదట.. శ్రీదేవి మరణంలో ఆమె సొంత తప్పిదమే ఉందని.. అలాగే ఆమె జాతకంలో కూడ ఒక దోషం ఉందని అందుకే ఇలా జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


శ్రీదేవి మరణానికి కారణం ఆమె యంగ్ గా కనిపించడం కోసం.. ఉండవలసిన వాటికంటే ఎక్కువగా డేటింగ్ చేయడం అలాగే ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేయించుకోవడమే కాకుండ.. ఆహారాలు తిన్న తర్వాత ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినిందని సమాచారం. వీటికి తోడు శ్రీదేవికి హైబీపీ, హై డయాబెటిస్ లాంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడేదట. అంతేకాకుండా ఒక జ్యోతిష్యుడు శ్రీదేవికి జలగండం ఉందని చెప్పిన కూడ ఆమె ఈ విషయాలను పట్టించుకోలేదట.. కానీ చివరికి ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారమే శ్రీదేవి బాత్ టబ్ లో ఉన్న నీటిలో మునిగి మరణించింది. చిన్నవయసులో శ్రీదేవి తల్లిదండ్రులు కూడా ఈ దోషం పోవాలని ఎన్నో పూజలు యాగాలు చేయించారట. కానీ చివరికి మాత్రం ఆ దోషము నిజమయ్యింది.. మరి ఇది ఎంత నిజమో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: