ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఎంతో బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి పార్ట్  పుష్ప మూవీ ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అయితే భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ అల్లు అర్జున్ కేరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాసింది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్లో పుష్ప సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్స్ కూడా ప్రేక్షకులను మూవీపై మరింత ఆత్రుతను పెంచేసాయి. అయితే ఇక ఈ సినిమా కోసం రెండేళ్లుగా నిరీక్షణగా ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే క్రేజీ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా  ప్రచారం జరుగుతుంది.


 ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలా అల్లు అర్జున్ -  అట్లీ కాంబో మూవీ గురించి ఒక బిగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి- సిరీస్ నిర్మించబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీత ఆర్ట్స్ తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: