టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎప్పుడో కాని హిట్ రాదు అని కొందరి నమ్మకం. దీనికి ఉదాహరణగా ‘మన్మధుడు 2’ ‘కిక్ 2’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలను ఉదాహరిస్తూ ఉంటారు. అయితే సీక్వెల్స్ గా వచ్చిన ‘బాహుబలి 2’ ‘కేజీ ఎఫ్ 2’ ‘టిల్లు స్కేర్’ లు భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.



అయితే సీక్వెల్స్ గా వచ్చిన చాల సినిమాలు పరాజయం చెందడంతో ఇండస్ట్రీలో సీక్వెల్స్ పై పెద్దగా ఆశక్తి లేదు. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘మత్తువాదలరా 2’ సీక్వెల్ పై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈసినిమాలో నటించిన హీరోలలో ఒకడు కీరవాణి కొడుకు కావడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు రాజమౌళి చిరంజీవి మహేష్ ప్రభాస్ లు ఈమూవీని చాల వ్యూహాత్మకంగా ప్రమోట్ చేశారు.



దీనితో ఒక్కసారిగా ఈమూవీ పై అంచనాలు పెరిగాయి. వాస్తవానికి గత కొంతకాలంగా సరైన హాస్య సినిమా విడుదల లేకపోవడంతో ఈమూవీలో ఉన్నది మ్యాడ్ కామెడీ అయినప్పటికీ ప్రేక్షకులు ఆవిషయాన్ని పక్కకు పెట్టి ఈసినిమాను చూస్తూ ఉండటంతో ఈమూవీ మొదటి మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈసినిమా విడుదలైన మొదటిరోజున 5 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



బుక్ మై షోలో మొదటిరోజు 40 వేలకు పైగా టికెట్లు అమ్మినట్లుగా వస్తున్న వార్తలు మరింత షాకింగ్ గా మారాయి.  ఈమూవీకి బిసి సెంటర్లలో కూడ స్పందన బాగా రావడంతో ఈమూవీని ఈసంవత్సరం హిట్ జాబితాలోకి చేర్చారు. గతంలో లావణ్య త్రిపాఠీ తో ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాను తీసి పెద్దగా రాణించలేకపోయిన దర్శకుడు రితీష్ రాణా ఈమూవీతో  సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మారిపోయాడు. గత వారం విడుదలైన ‘35’ ఊహించని సక్సస్ అందుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘మత్తు వదలరా 2’ మ్యానియా ‘దేవర’ విడుదల అయ్యేంతవరకు ఉండే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: