RRR తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం SSMB ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మొదటిసారి వీరి కాంబినేషన్ రావడంతో ఈ చిత్రం పైన భారీగా హైప్స్ పెరిగిపోయాయి. ఇప్పటివరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాలలో వైరల్ గా మారుతోంది .గతంలో ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి.


దీనిపైన చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక న్యూస్ వైరల్ గా మారుతొంది..అదేమిటంటే ఈ సినిమా స్టోరీ 18వ శతాబ్దంలోని కథాంశం అన్నట్లుగా సమాచారం. ఈ కాలానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఏకంగా 200 మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక గిరిజన తెగకు సంబంధించిన గ్రామాన్ని రాజమౌళి తరహాలో సృష్టించబోతున్నారట.


ఇందుకోసం కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల చివరి కల్లా వర్క్ షాప్ ను పూర్తిచేసి డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ ప్రారంభించేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ముఖ్యంగా రాజమౌళి rrr చిత్రంలో చూపించిన తీరు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. మరి మహేష్ తో తీయబోతున్న ఈ చిత్రంలో అలాంటి కథాంశం అంటే ఇక అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం మహేష్ బాబు సుమారుగా రెండేళ్ల పాటు డేట్ లను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. మరి నటి నటులు ఎవరెవరు అనే విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: