మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మంచి సినిమా నచ్చితే దానిపై పొగడ్తలు , ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికే చిరంజీవి ఎన్నో సినిమాలకు తనదైన స్థాయిలో రివ్యూలను ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా శ్రీ సింహ హీరోగా ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా , సత్య ప్రధాన పాత్రలో రితీష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల మంచి విజయం అందుకున్న మత్తు వదలరా మూవీ కి కొనసాగింపుగా రూపొందింది.

ఇకపోతే మత్తు వదలరా 2 సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు. అందుకు సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో చేశాడు.

సోషల్ మీడియా వేదికగా మత్తు వదలరా 2 సినిమా గురించి చిరంజీవి స్పందిస్తూ ... నిన్ననే 'మత్తు వదలరా - 2' మూవీని చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు ఏది కూడా కనపడలేదు. చివరగా ఈ సినిమాకు సంబంధించిన ఎండ్ టైటిల్స్ ను కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా కూడా రితేష్ రాణా కి ఇవ్వాలి.  
అతని రాత , తీత , కోత , మోత , ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. అద్భుతం రితీష్ రానా. నటీనటులు శ్రీ సింహ  కి , ప్రత్యేకించి సత్య కి  నా  అభినందనలు.  అలాగే ఫరియ అబ్దుల్లా , కాల భైరవ లకు మంచి విజయాన్ని అందుకున్న మైత్రి సంస్థకు ,
టీం అందరికీ నా అభినందనలు. ఇక చివరగా చిరంజీవి అసలు ఈ సినిమాను మిస్ కాకుండా 100% గ్యారంటీ ఎంటర్టైనర్ అని రాసుకోచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: