శ్రీ సింహ హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో సత్య కీలక పాత్రలో కొన్ని సంవత్సరాల క్రితం మత్తు వదలరా అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమా భారీ కలక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా శ్రీ సింహ , సత్య రితీష్ రానా లకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా మత్తు వదలర 2 అనే సినిమాను రితీష్ రానా , శ్రీ సింహ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా సత్య ప్రధాన పాత్రలో రూపొందించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ మూవీకి నైజాం ఏరియాలో 1.36 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.74 కోట్ల షేర్ , 5.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 38 లక్షలు , ఓవర్సీస్ లో 1.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 5.02 కోట్ల షేర్ , 9.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 8.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 3.48 కోట్ల షేర్ కలక్షన్ ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: